టాలీవుడ్
సినిమా పరిశ్రమలో
కామెడీ చిత్రాల హీరోగా
అల్లరి నరేష్ కు మంచి పేరు ఉంది. ఎంతో టెన్షన్ లో ఉన్న కూడా
అల్లరి నరేష్ సినిమా చూస్తే మనసుకు తేలికగా ఉంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. కెరీర్ మొదట్లో వరుస
కామెడీ సినిమా లు చేసి ఆ విధమైన
సినిమా లు చేసే హీరోగా పాతుకుపోయి తెలుగు
సినిమా పరిశ్రమలో పాతుకు పోగా గత కొన్ని సినిమాలుగా అల్లరినరేష్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించడం లేదు. దాంతో ఆయన అభిమానులు ఎంతో తీవ్రమైన నిరాశకు గురయ్యారు.
ఏ ప్రయత్నం చేసినా కూడా అది ఫలించకపోవడంతో
అల్లరి నరేష్ దాదాపు తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేలా కనిపించాడు. అలాంటి ఆయన కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పిన
సినిమా మహర్షి. మహేష్ బాబు హీరోగా
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో
అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించగా ఈ
సినిమా ఆయనకు అదృష్టాన్ని తెచ్చి పెట్టింది అని చెప్పవచ్చు. ఈ తర్వాత ఆయన నటించిన నాంది చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
రెగ్యులర్ గా
అల్లరి నరేష్ చేసే
కామెడీ సినిమా లా కాకుండా సీరియస్
జోనర్ లో ఈ
సినిమా చేయడంతో ఈ
సినిమా ఆయనకు మంచి హిట్ ను అందించింది. ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందంటే
బాలీవుడ్ లో కూడా ఈ సినిమాని
రీమేక్ చేస్తున్నారు అక్కడ
అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నాడు. మొత్తానికి ఈ సంవత్సరం
అల్లరి నరేష్ కు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం ఆయన సభకు నమస్కారం అనే పొలిటికల్
థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా వెరైటీ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా.
కామెడీ జోనర్ ను వదిలేసి
అల్లరి నరేష్ విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించడం వాటిలో
సక్సెస్ అవ్వడం అల్లరినరేష్ అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మరి భవిష్యత్తులో అల్లరినరేష్ నుంచి ఎలాంటి విభిన్నమైన చిత్రాలను చూడాల్సి వస్తుందో.