ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు...అధికారంలో ఉన్నా లేకపోయిన వారికి ఎప్పుడూ అండగానే ఉంటారు. కానీ సర్వేపల్లి ప్రజలు మాత్రం సోమిరెడ్డిని కాదని వేరే నాయకుడుని గెలిపించుకుంటున్నారు. గత నాలుగు పర్యాయాలుగా అదే జరుగుతూ వస్తుంది. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అవుతూ వస్తుంది. అయితే 2014లో గెలవకపోయిన ఎమ్మెల్సీ అయి, మంత్రిగా కూడా పనిచేశారు. అప్పుడు నియోజకవర్గంలో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయినా సరే ప్రజలు ఆయన్ని గెలిపించలేదు.
ఇప్పుడు సోమిరెడ్డి కంటే గొప్పగా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అభివృద్ది కార్యక్రమాలు ఏమి చేయడం లేదనే చెప్పొచ్చు. ఏదో సంక్షేమ పథకాలు ఒకటి వస్తున్నాయి తప్ప..నియోజకవర్గంలో అభివృద్ధి అంతంత మాత్రమే...పైగా ఇక్కడ వైసీపీ నేతల అక్రమాలు కూడా పెరిగాయని తెలుస్తోంది. అలా అని ఇక్కడ ప్రజలు కాకానికి మద్ధతుగా లేకుండా లేరు. ఆయనకు ఇంకా మద్ధతుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.
సోమిరెడ్డికి సర్వేపల్లి ప్రజల మద్ధతు పెరిగినట్లు కనిపించడం లేదు. క్షేత్ర స్థాయిలో చూసుకుంటే కాకానిపై పెద్దగా నెగిటివ్ రావడం గానీ, సోమిరెడ్డికి పాజిటివ్ రావడం గానీ జరిగినట్లు కనిపించడం లేదు. అయితే సోమిరెడ్డి సర్వేపల్లిలో ఇంకా కష్టపడాల్సి ఉంది. కాకపోతే రెండు దశాబ్దాల నుంచి కష్టపడుతూనే ఉన్నారు గానీ...సర్వేపల్లి ప్రజలు మాత్రం సోమిరెడ్డి కష్టాన్ని అర్ధం చేసుకుంటున్నట్లు కనిపించడం లేదు. మరి ఈ సారైనా అర్ధం చేసుకుంటారేమో చూడాలి.