ఎన్నికలంటే ఎప్పుడూ హాట్ హాట్ న్యూస్.. సీరియస్ వార్నింగ్స్.. ఇంతేనా.. కొంచమైనా కామెడీ ఉండొద్దా.. అని బాధపడే మీడియాకు ఇప్పుడు కేఏ పాల్ రూపంలో మాంచి లాఫింగ్ స్టాక్ లభిస్తోంది. ఎప్పుడో పదేళ్ల క్రితమే ప్రజాశాంతి పార్టీ పెట్టిన ఆయన ఇటీవల తరచూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు.
ఆయన ధైర్యం, ఆత్మవిశ్వాసం ఏమో కానీ.. వచ్చే ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి కావడం ఖాయం అని నమ్మకంగా చెబుతున్నారు. అక్కడి నుంచి ఏమాత్రం తగ్గడం లేదు కే ఏ పాల్. తాను చేయించుకున్న సర్వేలు ఇదే విషయం ఢంకా భజాయించి చెబుతున్నాయట. అంతే కాదు.. తాను ముఖ్యమంత్రి కాగానే టీడీపీ అధినేత చంద్రబాబును అడ్వైజర్ గా పెట్టుకుంటాడట.
అంతేకాదు.. తన ప్రభంజనాన్ని గుర్తించి.. దాన్ని అడ్డుకునేందుకు ఇప్పటికే చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఎన్నో రకాలుగా తనను ఇబ్బంది పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. కానీ అవేవీ వర్కవుట్ కావట.. తప్పుకండా తానే వచ్చే ఎన్నికల తర్వాత సీఎం అవుతాడట. అక్కడితో కేఏ పాల్ ప్రవచనాలు ఆగిపోలేదు. దేశంలో మోడీకి తానొక్కడే ప్రత్యామ్నాయమట.
అంతే
కాదు.
కేంద్రంలో
మూడో కూటమి అధికారంలోకి వచ్చే
ఛాన్స్ ఉందట.
అందుకే
తాను కేసీఆర్ తో కలసి
పనిచేస్తాడట.
మొన్నటికి
మొన్న అద్వానీ తనను చేతులు
జోడించి మోడీకి సాయం చేయొద్దని
కోరారని కేఏపాల్ చెప్పాడు.
అంతే
కాదు..
ప్రధాని
మోడీ స్వయంగా తన వద్దకు వచ్చాడని
కూడా అంటున్నాడు కేఏ పాల్..
ఇవన్నీ
చూస్తే..
ఒరేయ్..
వాడినెవరికైనా
చూపించండ్రా..
అలా
వదిలేయకండ్రా అనే రావు రమేశ్
డైలాగ్ గుర్తుకు రావడం లేదూ..