
స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ (ఎస్వోటీ) విభాగం ద్వారా 2023 శాసనసభ ఎన్నికల ముందు భారాసకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ నిఘా కోసం అనుమతులు సేకరించేందుకు ప్రభాకర్ రావు పేరిట ఫోన్ నంబర్ల జాబితాను ఉన్నతాధికారులకు పంపారు. ఈ జాబితాలోని వ్యక్తులను మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారని ఆరోపిస్తూ అనుమతులు పొందారు. ఈ విధంగా సేకరించిన సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రభాకర్ రావు బృందం ఈ కాల్ రికార్డులను నిల్వ చేసిన హార్డ్డిస్క్లను ఎన్నికల తర్వాత మూసీ నదిలో పడేసి ధ్వంసం చేసింది. అయితే, ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణలో ఈ హార్డ్డిస్క్ల నుంచి ఎలాంటి సమాచారం లభ్యం కాలేదు. కానీ, ప్రణీత్ రావు మరిచిన ఫోన్ డేటా ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. ఈ ఆధారాలతో సిట్ ప్రభాకర్ రావును తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ఈ ట్యాపింగ్ కార్యకలాపాలకు ఎవరి ఆదేశాలు ఉన్నాయనే దిశగా దర్యాప్తు సాగుతోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు