ఏపీలో గత వైసీపీ పాలనతో కుంటుపడిన అభివృద్ధి కూటమి రాకతో పరుగులు పెడుతుంది. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో కూటమి సూపర్ సక్సెస్ అవుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వెల్లడించింది. రాష్ట్రం లో నేషనల్ హైవేలకు మ‌హ‌ర్ద‌శ‌ పట్టించేందుకు ముందడుగు వేసింది. పలు హైవేలను పది మీటర్ల వెడల్పుతో రెండు వ‌రుస‌లుగా, మరికొన్ని నాలుగు వ‌రుస‌లుగా విస్తరించేందుకు నిధులు మంజూరు చేసింది. దీంతో ఏపీలో ఎప్ప‌టినుంచో విస్తరణ కోసం ఎదురుచూపులు చూస్తున్న జాతీయ రహదారి-216 హెచ్ కి మోక్షం లభించిన‌ట్లైంది.


కృష్ణాజిల్లా పెడన నుంచి గుడివాడ, హనుమాన్ జంక్షన్, నూజివీడు, విస్సన్నపేట మీదగా ఎన్టీఆర్ జిల్లా లక్ష్మీపురం వరకు ఉన్న ఈ నేషనల్ హైవే-216 హెచ్ ను నాలుగు లైన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇందుకోసం రూ. 4,245 కోట్లు కేటాయించింది. మొత్తం 118 కి.మీ విస్త‌రించనున్నారు. అందులో భాగంగా.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 9 చోట్ల బైపాస్‌‌ను నిర్మించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.


అలాగే హైవే విస్తరణకు 700 ఎకరాల భూమిని సేకరించాలని.. అందుకు రూ.500 కోట్లు మేర‌ ఖర్చు అవుతుందని అధికారులు అంచ‌నా వేశారు. ఇక‌పోతే ఈ నేష‌న‌ల్‌ హైవే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ద‌గ్గ‌ర‌గా వెళ్తుంది. త‌ద్వారా రాజధానికి జ‌నాల‌ రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ జాతీయ రహదారి విస్తరణతో పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని.. ట్రాఫిక్ త‌గ్గుతుంద‌ని అంటున్నారు. పైగా తెలంగాణకు, మచిలీపట్నం పోర్టుకు ఈ హైవే అనుసంధానం ఏర్ప‌డుతుంది. హైవే విస్త‌ర‌ణ‌తో ఖమ్మం నుంచి గ్రానైట్‌ను మచిలీపట్నం పోర్టుకు తరలించడం, నూజివీడు మామిడి పండ్లను రవాణా సుల‌భ‌త‌రం అవుతుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: