
నాన్నను వాళ్ళు ముంచేస్తున్నారు:
కవిత ఎప్పుడైతే లిక్కర్ స్కాంలో ఇరుక్కొని జైలు నుంచి బయటకు వచ్చిందో అప్పటినుంచి తన కుటుంబంతో విభేదాలు పెట్టుకుంటూ వస్తోంది. చివరికి కేసీఆర్ కు తన బాధని చెప్పుకోవాలని ప్రయత్నం చేసిన ఆయన ససేమిరా అనడంతో కోపోద్రిక్తురాలైన కవిత చివరికి కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు లను టార్గెట్ చేసి మాట్లాడింది. హరీష్ రావు పెద్ద ఫ్రాడ్ అంటూ తన తండ్రిని ముంచేస్తారని చెప్పుకొచ్చింది. అంతేకాదు తన అన్న కూడా మంచివాడు కాదని కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని వర్ణించింది. ఇలా వారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో బీఆర్ఎస్ పార్టీలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంకేముంది కవితను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు పార్టీ అధిష్టానం. దీంతో కవిత జాగృతి పేరుతో సరికొత్త పంథాతో ముందుకు వస్తోంది. ఎలాగైనా తండ్రి మనసు దోచేయాలని ప్రయత్నాలు చేస్తోంది.
బతుకమ్మ వేడుకల్లో భావోద్వేగం:
తాజాగా బతుకమ్మ వేడుకల సందర్భంగా చింతమడక ప్రజల ఆహ్వానం మేరకు ఆమె అక్కడికి హాజరై బతుకమ్మ వేడుకల్లో ఆడి పాడింది. చింతమడక గ్రామంతో తనకున్నటువంటి అవినాభావసంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. తన తండ్రి కేసీఆర్ తనని పట్టించుకోవడంలేదని కొంతమంది వ్యక్తులు తనను దూరం చేశారన్నది. చింతమడక అంటే ఒక చరిత్ర కలిగిన గ్రామం..అసలు తెలంగాణ ఉద్యమానికి మొదట అడుగు పడింది కూడా ఈ గ్రామం నుంచే అంటూ చెప్పుకొచ్చింది. చాలా ఏళ్ల నుంచి ఈ గ్రామానికి నేను రాలేదు. కానీ మీ ద్వారా మరోసారి రావడానికి అవకాశం వచ్చింది. చింతమడక ఇచ్చిన ధైర్యంతోనే రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా బతుకమ్మ గురించి చాటి చెప్పాను. అయితే నేను చింతమడక రావాలంటే కొన్ని ఆంక్షలుంటాయి. సిద్దిపేట మరియు చింతమడక గ్రామాలు వాళ్ల ప్రైవేట్ ఆస్తుల్లా భావిస్తున్నారు. వాళ్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నా గ్రామానికి నేను వస్తానని చెప్పుకొచ్చింది కవిత. నన్ను నా కుటుంబానికి దూరం చేస్తూ చాలా ఏడిపిస్తున్నారు.. నన్ను ఎంత ఏడిపించిన బరిస్తాను కానీ మా నాన్నను మోసం చేయాలని చూస్తే అస్సలు ఊరుకోను. నేను ఇంత దుఃఖంలో ఉన్నా కానీ చింతమడక గ్రామస్తులు నన్ను ఆదరించారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, మీ అందరికీ రుణపడి ఉంటాను అంటూ కవిత ఎమోషనల్ అయింది.