
6వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ ట్యాబ్లను అందుకోనున్నారు. విద్యార్థులు ట్యాబ్ల ద్వారా గణితం, సైన్స్, ఇంగ్లీష్, జీవన నైపుణ్యాల వంటి సబ్జెక్టులను నేర్చుకోనున్నారు. ఉపాధ్యాయులు కూడా డిజిటల్ పద్ధతిలో పాఠాలను బోధించేందుకు ప్రత్యేక శిక్షణ పొందారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా వాతావరణం ఏర్పడనుంది. పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలు సానుకూలంగా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. పేద విద్యార్థులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకుని భవిష్యత్తులో గ్లోబల్ స్థాయిలో పోటీపడగలరనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద ఇన్ఫోసిస్ సంస్థ ఈ ట్యాబ్లను అందిస్తోంది. ప్రభుత్వం – ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో విద్యా రంగంలో కొత్త దశ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులు నాణ్యమైన డిజిటల్ విద్యను పొందగలుగుతారు. మొత్తంగా చూస్తే… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫోసిస్తో కలిసి చేపడుతున్న ఈ కార్యక్రమం విద్యా రంగంలో గేమ్ చేంజర్గా నిలిచే అవకాశం ఉంది. ట్యాబ్ల ద్వారా విద్యార్థులు కేవలం సబ్జెక్టులు నేర్చుకోవడమే కాదు, టెక్నాలజీ పట్ల అవగాహన పెంచుకుని భవిష్యత్తులో డిజిటల్ ఇండియా లక్ష్య సాధనలో భాగస్వాములు కానున్నారు.