ఇటీవల కాలం లో ఎక్కడ చూసినా కూడా మహిళలపై వేధింపులు రోజు రోజుకు ఎక్కువ ఉన్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టట్లేదు అనే విషయం తెలిసిందే. అయితే మహిళలపై వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఎంతో మంది ఇక మంచి వాళ్ళ ముసుగు వేసుకొని మాటలు చెబుతూ ఇక సమయం సందర్భం వచ్చినప్పుడు తమలో దాగి ఉన్న నీచమైన బుద్ధిని బయటపెడుతున్నారు. మహిళలపై వేధింపులు రోజురోజుకు ఎక్కువవుతున్న తరుణంలో మహిళలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.


 అయితే ఇక ఇలా వేధింపుల నేపథ్యం లో ఎంతో మంది మహిళలు భయపడి పోతున్నారు అని చెప్పాలి. అయితే కొంత మంది మహిళలు మాత్రం తమను ఎవరైనా వేధిస్తున్నారు అంటే చాలు వారికి సరైన బుద్ధి చెప్పడం చేస్తూ ఉన్నారు. తద్వారా ఆడపిల్ల అంటే అబలకాదు సబల అన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. ఏకంగా తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన యువకుడికి మహిళా సరైన బుద్ధి చెప్పింది. చివరికి సదరు యువకుడు ఆసుపత్రి పాలు కావలసిన పరిస్థితి ఏర్పడింది.


 ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. ఒక మహిళ పొలానికి వెళుతూ ఉండగా యువకుడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఈ క్రమం లోనే నిందితుడు మహిళను బలవంతం గా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన సదరు మహిళ యువకుడి పెదవిని కొరికి వేరు చేసేసింది. దీంతో నొప్పితో విలవిల లాడిపోయిన యువకుడు ఆమెను వదిలేశాడు. దీంతో మహిళా గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడికి వచ్చి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: