మరోవైపు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా ప్రచారాన్ని జోరుగా చేపడుతున్నారు. అయితే టీఆర్ఎస్కు ధీటుగా ప్రచారం చేపట్టేందుకు ఒక పథకం పన్నారు. ఇందులో ముఖ్యంగా కేంద్ర హోంశాఖమంత్రి అమిత్షాను రంగంలోకి దించనున్నట్టు సమాచారం. ఈటల గెలుపుతో తెలంగాణలో పాగా వేసేందుకు మెండుగా అవకాశాలు ఉంటాయని బావిస్తోంది బీజేపీ. గెల్లు శ్రీనివాస్ కు మద్దతుగా సీఎం కేసీఆర్ త్వరలో ప్రచారం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈటల గెలుపించేందుకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసీఆర్ నిర్వహించే సభకు ధీటుగా బీజేపీ ప్రచారసభ నిర్వహించి టీఆర్ఎస్ దూకుడుకు చెక్ పెట్టాలని భావిస్తోంది. తొలుత అమిత్షా సభను రద్దు చేసుకుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ తరుణంలో అమిత్షాతో సభ నిర్వహించాలని నిర్ణయించారు. సభ ఎప్పుడనేది త్వరలో తేలనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి