ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక క్షణంలో పుడుతూ ఉంటుంది. మనుషుల మధ్య పుట్టిన ప్రేమ ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగులుస్తుంది. కొంతమంది పరిస్థితులకు లోబడి ఇక ప్రేమను వదులుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. కానీ మరి కొంత మంది ప్రాణాలకు తెగించి అయినా సరే తమ ప్రేమను బ్రతికించుకోవడానికి సాహసాలు సైతం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా పుడుతున్న ప్రేమలు ఎన్నో ఊహించని ఘటనలకు కారణం గా మారిపోతున్నాయి అని చెప్పాలి.


 సోషల్ మీడియా అన్న తర్వాత ప్రస్తుతం పరిధి లేకుండా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  సోషల్ మీడియా కారణంగా ఒక దేశంలో ఉన్న వ్యక్తి మరో దేశంలో ఉన్న వారిని కూడా ప్రేమించేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కారణంగా ఇలా వేరు వేరు  దేశాల్లో ఉండి ప్రేమించుకుంటున్న వారు కూడా ఎక్కువై పోతున్నారు. తమ ప్రేమను గెలిపించుకునేందుకు రహస్యంగా దేశం దాటి వెళ్ళి పోవడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఓ యువతి తన ప్రేమను గెలిపించుకోవడానికి ప్రియుడితో జీవితాంతం సంతోషంగా బ్రతకడానికి ఇలాంటిదే చేసింది.



 బంగ్లాదేశ్కు చెందిన కృష్ణ మండల్ భారత్ కు చెందిన అభిక్ మండల్ కు ఫేస్బుక్ వేదికగా పరిచయమైంది. కొన్నాళ్ళకి వీరి పరిచయం ప్రేమగా మారి పోయింది.  పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమెకు పాస్ పోర్ట్ లేదు   దీంతో రాయల్ బెంగాల్ టైగర్స్ ఉండే  సుందర్బన్ అడవుల్లోకి ప్రవేశించి అక్కడ మూడు గంటలపాటు నది లో ఈదుకుంటూ వచ్చి చివరికి ప్రియుడిని చేరుకుంది. కోల్కతాలోని కాళీ ఆలయంలో ఇక సదరు యువతి ప్రియుడి ని పెళ్లి చేసుకోవడం గమనార్హం. అయితే దేశం లోకి అక్రమంగా చొరబడిన ఆమెను అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: