అల్లు అర్జున్ , అనురాధ మెహతా హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు "ఆర్య" అనే మూవీని నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 2004వ సంవత్సరం మే 7వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ ద్వారా అల్లు అర్జున్ , సుకుమార్ , దిల్ రాజుకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

మూవీ 2024 మే 7వ తేదీతో 20 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఇలా ఈ సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం , ఈ మూవీ కి పని చేసిన అనేక మంది టెక్నీషియన్స్ , నటీనటులు ప్రస్తుతం ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయిలో ఉండడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన 20 సంవత్సరాల వేడుకను చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో భాగంగా సుకుమార్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను , ఈ మూవీ స్టార్ట్ కావడానికి ముందు ... ఈ మూవీ జరుగుతున్న సమయంలో జరిగిన కొన్ని విషయాలను తెలియజేశారు.

అందులో భాగంగా సుకుమార్ ... మొదట దిల్ రాజు గారికి ఈ కథను చెప్పినప్పుడు ఇందులోని ఒక చిన్న సన్నివేశాన్ని చెప్పాను. అందులో హీరోయిన్ దాబా పై వర్షంలో ఆడుకుంటూ ఉంటే కింద హీరో ఆ వాటర్ ని పడుతూ ఉంటాడు. ఆ సీన్ అద్భుతంగా నచ్చే రాజు గారు నాకు డైరెక్షన్ అవకాశం ఇచ్చారు. ఇక సినిమా షూటింగ్ ప్రాసెస్ లో ఆ సీన్ తీయకుండానే సినిమా కంప్లీట్ అయింది. కాకపోతే ఆ సీన్ నేను కచ్చితంగా తీయాలి అనుకున్నాను.

కానీ దిల్ రాజు గారు అవసరం లేదు. ఇప్పటికే ఖర్చు ఎక్కువ అయ్యింది. సినిమాకు ఆ సీన్ పెద్దగా ఇంపార్టెంట్ ఏమీ కాదు. లేకున్నా మేనేజ్ చేయొచ్చు అన్నాడు. కానీ అది నాకు నచ్చలేదు. దానితో ఆయనతో గొడవ కూడా పెట్టుకున్నాను. చివరికి ఏమీ చేయలేక ఆయన కాళ్లు పట్టుకున్నాను. ఇక సినిమా మొత్తం అయ్యే లోపు అతని కాళ్లు నేను మూడు సార్లు పట్టుకున్నాను అని సుకుమార్ అనగా... దిల్ రాజు రెండే సార్లు పట్టుకున్నావు అన్నారు. దానితో సుకుమార్ అంత కచ్చితంగా గుర్తు పెట్టుకున్నారు అని సరదాగా అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: