గ్లోబల్ స్థాయిలో పేరు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో స్టార్ హీరో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ స్టార్ కీయారా అద్వానీ హీరోయిన్గా కనిపించబోతోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి

 సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేస్తాము అని ముందుగానే ప్లాన్ చేశారు . అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న  సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.  స్టార్ దర్శకుడు శంకర్ రామ్ చరణ్తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో పాటు విశ్వ నటుడు కమల్ హాసన్ తో ఇండియన్ టు సినిమా కూడా తీస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియక ఈ సినిమా

 విడుదల కాస్త పొడిగిద్దామని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రస్తుతం దర్శకుడు తన పూర్తి సమయాన్ని గేమ్ చేంజర్ సినిమా కోసం కేటాయించలేకపోయాడు. అందుకే గేమ్ చేంజెస్ సినిమా షూటింగ్ రోజు రోజుకు ఆలస్యం అవుతూ వచ్చింది. అందుకే ఇప్పుడు ఈ సినిమా విడుదలను పొడిగించి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాంచరణ్ నటించిన ‘గేమ్‌ఛేంజర్‌' రిలీజ్‌ ఎప్పుడు అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాలి.. ఈ సినిమాలో రాంచరణ్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు సమాచారం.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి మరో హీరోయిన్ గా నటించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: