ఇటీవల సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో నెపోటిజం, బాలీవుడ్ మాఫియాపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. చేతన్ కూడా వీటిపై స్పందించాడు. బాలీవుడ్ మాఫియా నాకు కూడా అన్యాయం చేసిందని, నా స్టోరీలతో తీసిన సినిమాలలో నా పేరు వేయలేదని, నాకు రావాల్సిన అవార్డులు వాళ్ళు తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. సుశాంత్ కి సపోర్ట్ గా కూడా మాట్లాడారు.
తాజాగా చేతన్ భగత్ ఓ పుస్తకం రాస్తున్నట్టు తెలిపారు. ఈ పుస్తకానికి 'వన్ అరేంజ్డ్ మర్డర్' అనే పేరుని పెట్టినట్లు తెలిపారు. రేపు తన కొత్త పుస్తకం కవర్ పేజీను విడుదల చేస్తానని ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలోనే చేతన్ భగత్ ఈ పుస్తకం రాస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే రేపు కవర్ పేజీ వచ్చేవరకు లేదా పుస్తకం రిలీజ్ అయ్యేవరకు ఎదురు చూడాలి.