చేతన్ భగత్.. భారతదేశంలో ప్రముఖ నవలా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా అందరికి తెలుసు. తను రాసిన పుస్తకాలు ఎంత ఫేమస్ అయ్యాయో కూడా తెలుసు. ఇప్పటికే హాఫ్ గర్ల్ ఫ్రెండ్, 2 కంట్రీస్, రెవల్యూషన్ 2020, 3 మిస్టేక్స్ ఇన్ మై లైఫ్, వన్ ఇండియన్ గర్ల్ లాంటి ఎన్నో పుస్తకాలు రాసారు. అయన రాసిన పుస్తకాలు విపరీతంగా అమ్ముడుపోతాయి. ఆయన పుస్తకాలని సినిమాలుగా కూడా తీశారు. కొన్ని సినిమాలకు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా అవార్డులు కూడా అందుకున్నారు. చేతన్ భగత్ ప్రస్తుతం పుస్తకాలు, సినిమాలకు స్క్రీన్ ప్లే రైటర్ గానే కాకుండా టైమ్స్ ఆఫ్ ఇండియా, దైనిక్ భాస్కర్ వంటి పత్రికలలో కాలమ్స్ కూడా రాస్తుంటారు.
ఇటీవల సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో నెపోటిజం, బాలీవుడ్ మాఫియాపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. చేతన్ కూడా వీటిపై స్పందించాడు. బాలీవుడ్ మాఫియా నాకు కూడా అన్యాయం చేసిందని, నా స్టోరీలతో తీసిన సినిమాలలో నా పేరు వేయలేదని, నాకు రావాల్సిన అవార్డులు వాళ్ళు తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. సుశాంత్ కి సపోర్ట్ గా కూడా మాట్లాడారు.    
తాజాగా చేతన్ భగత్ ఓ పుస్తకం రాస్తున్నట్టు తెలిపారు. ఈ పుస్తకానికి 'వన్ అరేంజ్డ్ మర్డర్' అనే పేరుని పెట్టినట్లు తెలిపారు. రేపు తన కొత్త పుస్తకం కవర్ పేజీను విడుదల చేస్తానని ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలోనే చేతన్ భగత్ ఈ పుస్తకం రాస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే రేపు కవర్ పేజీ వచ్చేవరకు లేదా పుస్తకం రిలీజ్ అయ్యేవరకు ఎదురు చూడాలి.

    

మరింత సమాచారం తెలుసుకోండి: