అల వైకుంఠపురములో సినిమా తర్వాత భారత దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బుట్టబొమ్మ
పూజా హెగ్డే కి ప్రస్తుతం భారీ ప్రాజెక్టు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ రాధేశ్యామ్, ఆచార్య వంటి భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నారు. ఈమె
రణవీర్ సింగ్,
రోహిత్ శెట్టి నటిస్తున్న సర్కస్ అనే సినిమాలో కూడా కనిపించనున్నారు.
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న కబీ ఈద్ కబీ దివాళి చిత్రంలో కూడా
హీరోయిన్ గా చేస్తున్నారు. ఒకవైపు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోవైపు
బాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కించుకుంటున్న
పూజా ఇటీవల
దళపతి విజయ్ 65వ సినిమాలో
హీరోయిన్ అవకాశం దక్కించుకున్నారు.
అయితే ఈ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తున్నందుకు ఆమె అక్షరాల మూడు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట.
దళపతి విజయ్ సినిమా నుంచి ఆమె తన రెమ్యూనరేషన్ 3 కోట్లకు పెంచారట. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక
హీరోయిన్ మూడు కోట్ల రూపాయలు తీసుకోవడం చాలా అరుదు. ఐతే
నయనతార,
సమంత తర్వాత ఒక్క మూవీకి మూడు కోట్ల రూపాయలు తీసుకున్న
హీరోయిన్ గా
పూజా హెగ్డే రికార్డు సృష్టించారు. డిమాండ్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్ విపరీతంగా పెంచేసి
బ్యాంక్ అకౌంట్స్ నింపుకోవాలని హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు కూడా భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ హోదా దక్కించుకుంటున్న కుర్ర నటీనటులు కూడా తమ రెమ్యునరేషన్ ఛార్జ్ ని కోట్లలో పెంచేస్తున్నారు. వారందరితో పోలిస్తే
పూజా హెగ్డే మూడు కోట్లకు తన రెమ్యూనరేషన్ పెంచడం పెద్ద విషయమేమీ కాదని సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతుంది.
ఇకపోతే
పూజా హెగ్డే రాధేశ్యామ్ చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ
సినిమా జులై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఆమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జులై 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఆచార్య
సినిమా 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.