నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అఖండ'..  ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవు. దీంతో ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఇక ఉగాది సందర్భంగా ఈ సినిమా పేరును దీనికి సంబంధించి ఓ టీజర్‌ను విడుదల చేయగా.. ఆ టీజర్ మంచి ఆదరణ పొందింది.

 ఈ 'అఖండ' టీజర్ ఇప్పటికే 54 మిలియన్ వ్యూస్‌తో దుమ్ములేపుతోంది.ఇక్కడ మరో విశేషం ఏమంటే సౌత్ ఇండియాలో ఇంత తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరోగా బాలయ్య నిలిచారు. ఇక ఈ టీజర్‌లో బాలకృష్ణ గెటప్.. దీనికి తోడు బ్యాగ్రౌండ్ స్కోర్.. ఆయన చెప్పిన డైలాగ్‌లు అభిమానులతో పాటు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో తెగ వైరల్ అవుతోంది టీజర్.ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్‌లో గతంలో 'సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

 మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక మరోవైపు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా సమాచారం. ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది.ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు క్రాక్ డైరక్టర్ గోపీచంద్ తో దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపీచంద్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: