తన సినిమాల కథల విషయంలో చాలా జాగ్రత్తలు పడుతున్న శర్వానంద్ కు లక్ కలిసి రావట్లేదు. తమిళ సూపర్ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్ జాను సినిమాలో నటించాడు శర్వానంద్ ఆ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేదు. ఓ మంచి మెసేజ్ తో వచ్చిన శ్రీకారం సినిమా కూడా కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేదు. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నా ఆడియెన్స్ ను రీచ్ అవడంలో శర్వానంద్ ఎందుకో వెనకపడుతున్నాడు. అందుకే ఇకనుండి కంటెంట్ మీద మరింత దృష్టి పెడుతున్నాడు.
అజయ్ భూపతి డైరక్షన్ లో వస్తున్న మహా సముద్రం మల్టీస్టారర్ మూవీగా వస్తుంది. ఆరెక్స్ 100 తో సత్తా చాటిన ఈ డైరక్టర్ మహా సముద్రం సినిమాను దాన్ని మించే రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇక కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలతో శర్వానంద్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. మర్ ఈ సినిమాలైనా శర్వానంద్ ఫేట్ మారుస్తాయో లేదో చూడాలి.