పైసా వసూల్, రాగల 24 గంటల్లో, రాధాకృష్ణ లాంటి సినిమాల్లో నటించి తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న అందాల కథానాయిక ముస్కాన్ సేథి సినిమాలతో పాటు బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లు కూడా చేసి టాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని చూస్తోంది. సినిమాల‌తో పాటు మ‌సాబా మ‌సాబా, ల‌వ్ స్లీప్ రిపీట్ అనే వెబ్ సిరీస్‌ల్లోనూ న‌టించిన ముస్కాన్ రాధాకృష్ణ త‌ర్వాత తెలుగులో మ‌రో ప్ర‌స్థానం సినిమా చేసింది. మరో ప్రస్థానం సినిమాలో తనీష్ సరసన నటించిన ముస్కాన్ ఈ సినిమాతో హిట్ కొట్టి తీరతామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 


సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముస్కాన్ సేథి మాట్లాడుతూ, “మరో ప్రస్థానం మూవీ నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ అని, కొన్ని సీన్స్ లో లెంగ్తీ డైలాగులు ఉండేవని పేర్కొన్న ఆమె కొన్ని రోజులు డే అండ్ నైట్ షూట్ కూడా చేయడం జరిగిందని ఇది ఒక ఎమోషనల్ ఫిల్మ్ అని చెప్పుకొచ్చింది. ఇందులో నేను యాక్షన్ సీన్స్ లో కూడా నటించడం జరిగిందన్నా ఆమె ఫస్ట్ టైమ్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం వలన నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించిందని కానీ డైరెక్టర్ జానీ సార్ చాలా బాగా హెల్ప్ చేశారు, డైలాగుల విషయంలో ప్రామిటింగ్ చెప్పడం, కొన్ని సీన్స్ లో ఎలా నటించాలో యాక్ట్ చేసి చూపించడంతో నాకు చాలా ఈజీ అయిందని ఆమె చెప్పుకొచ్చింది. 


తనీష్ కెరీర్ లోనే భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు జానీ దర్శకత్వం వహించారు. వీరితో పాటు వరుడు ఫేమ్ భాను శ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ 'మరో ప్రస్థానం' సినిమాని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: