అయితే టాలీవుడ్ మెగా కాంబో మూవీ ఆచార్య వచ్చాక కేజీఎఫ్ మ్యానియా కాస్త తగ్గుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ మూవీ పవర్ మాత్రం ఇప్పట్లో తగ్గేదే లే అంటోంది. కలెక్షన్ల వర్డతో బాక్స్ ఆఫీస్ ను ముంచెత్తుతోంది. అందులోనూ ఆచార్య చిత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు మళ్ళీ రాఖీ బాయ్ వైపే చూస్తున్నారు. ఒక్క టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా రిలీజ్ అయిన ప్రతి చోట ఇలానే వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఇంకో రెండు రోజుల్లో 1000 కోట్ల మార్క్ నీ సులభంగా దాటేసెందుకు సిద్దంగా ఉన్నారు రాఖీ బాయ్ అంటూ బాక్స్ ఆఫీస్ విశ్లేషకులు చెబుతున్నారు.
తాజాగా 16 రోజు అయినటువంటి శనివారం నాడు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రూ.15.28 కోట్ల వరకు జరిగాయి. దీంతో ఇప్పటి వరకు జరిగిన వసూళ్ల విలువ రూ.959.10 కోట్లకు చేరగా ఇక రౌండ్ ఫిగర్ రూ.1000 కోట్లు చేయడానికి మరో రెండు రోజులు చాలు అంటున్నారు. మరి మన రాఖీ బాయ్ ఆ రౌండ్ ఫిగర్ నీ కూడా దాటేస్థారనే అంటున్నారు. ఈ స్థాయిలో కలెక్షన్ లు రాబడుతూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తా చాటుతూ జాతీయ స్థాయిలో మన్నలను పొందుతోంది ఈ మూవీ. ఈ జోరును బట్టి చూస్తే వచ్చే వారంలో ఈజీగా 1200 కోట్లు రీచ్ అవుతుందని తెలుస్తోంది.