బాలీవుడ్ లో స్టార్స్ వారసులు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసింది. దీంతో బాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ కూడా ఏర్పడలేదు. అందుచేతనే బాలీవుడ్ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ జోడిగా పేరుపొందిన అజయ్ దేవగన్, కాజోల్ గారాలపట్టి నైసా దేవగన్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో తన చదువులను పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ వెండితెరపై కనిపించేందుకు కూడా చాలా ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్లో పలు ఈవెంట్స్ జరిగిన సరే అక్కడ తన ప్రజెంట్ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలుస్తోంది నైసా.

ఇప్పటికే కాజోల్ కూతురు కోసం సినిమా కథలను కూడా వింటోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. హీరో అయినా హీరోయిన్స్ అయినప్పటికీ కెరియర్లో తొలి చిత్రానికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక స్టార్ బ్యాగ్రౌండ్ నుంచి వస్తున్నారు కాబట్టి ఆ హీరోయిన్ మీద మరింత ఫోకస్ ఉంటుందని చెప్పవచ్చు. అందుచేతనే నైసా కోసం  పలు కథలు వింటోంది ఈమె తల్లి. ఇక అజయ్ దేవగన్ కూడా హీరోగా పలు సినిమాలు చేస్తే బిజీగా ఉన్నారు.


బాలీవుడ్ లో ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ వారసురాలు ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నారు మరి ఇప్పుడు నైసా కూడా అదే దారిలో వెళ్లి సత్తా చాటాలని చూస్తోందట. ముఖ్యంగా జాన్వి, అనన్య పాండే, సారా అలీఖాన్ తదితరులు కూడా ఎంట్రీ ఇచ్చారు. స్టార్ కూతురుగా తన మీద ప్రెషర్ ఉన్నా సరే తన టాలెంట్ గా అందరిని మెప్పించడానికి సిద్ధమవుతోంది నైసా. తాజాగా దీపావళి పండుగ సందర్భంగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఎప్పుడు ఇవ్వబోతోంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: