రెబల్ స్టార్  ఫ్యామిలీకి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇలాంటి ఒక మంచి గుర్తింపు ఈ ఫ్యామిలీకి రావడానికి ముఖ్య కారణం కృష్ణంరాజు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రెబెల్ స్టార్ ప్రభాస్. అనంతరం వరుస సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ ని అందుకున్నాడు ప్రభాస్. ఇటీవల కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా కృష్ణంరాజు కోసం

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ చేసిన కొన్ని పనులు ఇప్పుడూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.అయితే ఈ క్రమంలోనే ప్రభాస్ కి ఇష్టం లేకపోయినా సరే కృష్ణంరాజు ఆ పనులను చేయించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.  ఒక హీరోయిన్తో ప్రభాస్ చేసిన రొమాన్స్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెబెల్ సినిమాలో హీరోయిన్ దీక్ష సేథ్ చేసిన రొమాన్స్ గురించి మనందరికీ తెలిసిందే. ఇక ఆ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. అయినప్పటికీ ఆ సినిమా కృష్ణంరాజుకి చాలా ఇష్టమని అయన చాలా సందర్భాలలో చెప్పుకొచ్చాడు.

అయితే మొదటగా రాఘవ లారెన్స్ ఈ సినిమాలో ఈమె స్థానంలో అనుష్క శెట్టి ని మొదటగా పెట్టాలని అనుకున్నారు. కానీ కృష్ణంరాజు మాత్రం ఆ పాత్ర కోసం దీక్ష సేద్ ని ఫిక్స్ చేశారట. అంతేకాదు ప్రభాస్ ని ఒప్పించి మరీ తనతో రొమాన్స్ చేయడానికి ఓకే చెప్పించారట కృష్ణంరాజు. అయితే దీక్ష సేద్ ని ఈ పాత్రకి అనుకున్న అనంతరం ప్రభాస్ కృష్ణంరాజుతో తను ఈ క్యారెక్టర్ కి సెట్ అవ్వదు అని చెప్పాడంట అయినప్పటికీ కృష్ణంరాజు నువ్వు తనతోనే చేయాలి అని చెప్పడంతో పెదనాన్నకి ఎదురు చెప్పలేక తనతో రొమాన్స్ చేయడానికి ఒప్పుకున్నాడట ప్రభాస్. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు వారిలో అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: