ఇకపోతే ప్రతినెల ఆదాయం అందించే పథకాలు కూడా పోస్టాఫీసులలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎలాంటి రిస్క్ లేకపోవడం వల్ల మనకు కచ్చితంగా రాబడి వస్తుంది. ఇక అలాంటి పథకాలలో మంత్లీ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ పథకంలో ఒక సారి కొంత డబ్బును పెట్టుబడిగా పెట్టి, ఆ తర్వాత స్థిరమైన నెలవారి ఆదాయాన్ని కూడా మనం పొందవచ్చు. ఈ మంత్లీ ఇన్కమ్ స్కీం లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రతినెలా కూడా మీకు కొంత మొత్తంలో డబ్బు అయితే వస్తుంది. ఇక ఈ స్కీం యొక్క కాలపరిమితి 5 సంవత్సరాలు అయితే మీరు మరో ఐదు సంవత్సరాల వరకు దీనిని పొడిగించుకోవచ్చు.. ఇక ఈ ఐదు సంవత్సరాల తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం తో పాటు స్థిరమైన నెలవారి ఆదాయాన్ని కూడా తిరిగి పొందవచ్చు..
పోస్ట్ ఆఫీస్ స్కీమ్ లో సంవత్సరం వడ్డీ రేటు 6.5 శాతంగా ఉంది.. ఐదు సంవత్సరాల కాల పరిమితి కాబట్టి ఇందులో మీరు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.. ఈ పథకంలో మీరు లక్ష రూపాయలను పెట్టుబడిగా పెట్టారని అనుకుంటే ఐదు సంవత్సరాల తర్వాత 6.6 శాతం వడ్డీ రేటుతో కూడా కలుపుకొని మీకు రూ.6600 వడ్డీ కూడా వస్తుంది. అంతే కాదు ప్రతినెలా ఐదు వందల యాభై రూపాయల చొప్పున పెన్షన్ కూడా మనం ఈ పథకం ద్వారా పొందవచ్చు.