ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎక్కువగా బయోపిక్ సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు లో మహానటి, యాత్ర (వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్), ఎన్టీఆర్ బయోపిక్ లు రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు తమిళ నాట ఎన్నో సంచలనాలకు నాంధి పలికిన నటి, రాజకీయ నాయకురాలు జయలలిత బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.
దక్షిణాది భాషలతో పాటు హిందీలోను విడుదల కానున్న ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి కనిపించనున్నారు. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మూవీపై కొత్త వార్త చక్కర్లు కొడుతుంది. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఇటీవల బాలయ్య తండ్రి నందమూరి తారక రామారావు జీవితకథను బయోపిక్గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు పేర్లతో తెరకెక్కించారు. అప్పట్లో యువకుడిగా ఉన్న పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారని తెగ రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ అది జరగలేదు..అయితే ఇప్పుడు తలైవి మూవీలో ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో కరుణానిధిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. అయితే సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర జూ.ఎన్టీఆర్ నటిస్తేనే చాలా గ్రాండ్ గా ఉంటుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.
మరి తన తాత పాత్రలో ఎన్టీఆర్ నటించేందుకు అంగీకరిస్తాడా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. కాకపోతే ఈ ఆఫర్ ను కూడా ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం ఆయన రాజమౌళి సినిమాతో ‘ఆర్ఆర్ఆర్’ బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఒక వేళ ఈ మూవీలో జూ.ఎన్టీఆర్ నటిస్తే మాత్రం రచ్చ రచ్చే అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.