మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు వర్ధన్ బాబు గురించి తెలియని వారుండారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ దర్శకత్వం వహించారు. మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా స్టీఫెన్ పనిచేస్తున్నారు. ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించారు. కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ శివయ్యగా, కాజల్ పార్వతిగా, ప్రభాస్ రుద్రుడిగా, మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా, శివ బాలాజీ కుమారదేవ శాస్త్రిగా, రఘుబాబు మల్లు పాత్రలో కనిపించనున్నారు.

ఇక ఈ సినిమా పోస్టర్ లు, టీజర్ లు కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఈ సినిమా పాటలు కూడా మంచి స్పందన పొందాయి. దీంతో కన్నప్ప మూవీపైన ప్రేక్షకులు మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం మూవీ మేకర్స్ చాలానే ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటుగా తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.
 
అయితే కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మిస్ అయిందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీలో గందరగోళం మొదలైంది. ఈ నేపథ్యంలో హీరో మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అందులో 'జటాజుఠదరి నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామి' అని విష్ణు రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ హార్డ్ డిస్క్ మిస్ అవ్వడంతో ఈ ట్వీట్ పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ట్వీట్ లో తనను శివుడు పరీక్షిస్తున్నాడనే ఉద్దేశంతో విష్ణు పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతొంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: