రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో విడుదలకు ముందే పలు రికార్డు లను ఖాతాలో వేసుకుంది. ఇక ఈచిత్రం ఇప్పుడు మరో రికార్డు కు సృష్టించడానికి సిద్దమవుతుంది. ఈనెల 30న ఈ చిత్రం తెలుగు , తమిళ , మలయాళ,హిందీ భాషల్లో విడుదలకానుండగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతుంది. హైదరాబాద్ లో అయితే దాదాపు మొదటి రోజు అన్ని థియేటర్లలో బుకింగ్స్ అయిపోయాయి. మిగితా భాషల్లో కూడా దాదాపు ఇంతే క్రేజ్ వుండడం ఇక దీనికి తోడు ఈచిత్రం దేశ వ్యాప్తంగా 4000కు పైగా స్క్రీన్ లలో విడుదలకానుండడం అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఈసినిమా టికెట్స్ ధరలు పెరగనున్న నేపథ్యంలో ప్రీమియర్స్ అన్ని కలుపుకొని మొదటి రోజే ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ ను రాబట్టే అవకాశం లేకపోలేదు.
ఒకవేళ 100 కోట్ల ఓపెనింగ్ ను గనుక రాబడితే బాహుబలి 2 తరువాత మొదటి రోజే ఈ ఘనత సాధించిన రెండవ సినిమాగా రికార్డు సృష్టించనుంది సాహో. ఇక ఈ రెండు తెలుగు సినిమాలే కావడం విశేషం. చూద్దాం మరి సాహో ఈ రికార్డు ను అందుకుంటుందో లేదో. 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించగా జాకీ ష్రాఫ్ , నిల్ నితిన్ ముఖేష్ ,మురళీ శర్మ , అరుణ్ విజయ్, మందిరా భేది తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సినిమా విడుదల నేపథ్యం లో ప్రభాస్ అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తూ సినిమా ఫై మరింతగా హైప్ తీసుకొస్తున్నాడు. కాగా తమిళనాడు లో సాహో 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. ఏకంగా అక్కడ 550 థియేటర్లలో సాహో ను ప్రదర్శించనున్నారు.