
ఇందులో భాగంగానే మనదపల్లి మున్సిపాల్టీని స్థానిక ఎమ్మెల్యే షాజహన్ బాషా గారితో పాటు మంత్రి రాం ప్రసాద్రెడ్డి గారి సహకారంతో ఓ వెల్ ప్లాన్ మున్సిపాల్టీగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నామని.... మదనపల్లితో పాటు పుంగనూరు, పలమనేరు, కుప్పంను మోడల్ మున్సిపాల్టీగా తయారు చేస్తామన్నారు. డీపీఆర్ వచ్చిన వెంటనే మదనపల్లిని మోడల్ మున్సిపాల్టీగా చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. రోడ్ల వెడల్పు, మంచినీటి సౌకర్యం, పారిశుధ్యం మెరుగుదల, పారిశ్రామిక అభివృద్ధి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్స్, ఇతర ప్రజా ప్రయోగ పనుల విషయంలో సరికొత్తగా ముందుకు వెళుతూ మదనపల్లి మున్సిపాల్టీని ఓ వరల్డ్ క్లాస్ మున్సిపాల్టీగా తీర్చిదిద్దుతాం. వచ్చే 50 ఏళ్ల మదనపల్లి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మదనపల్లి కొత్త డీపీఆర్ రెడీ అవుతోందన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.