కేసీఆర్ సర్కారు తెలుగు సినీ పరిశ్రమను ఆశ్చర్యపరిచేలా ఓ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి పద్మభూషణ్ పురస్కారానికి సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ నిర్మలను సిఫార్సు చేయబోతోందట. కృష్ణ భార్యగా కాక తనకంటూ సొంత ఇమేజ్ సృష్టించుకున్న వ్యక్తి విజయ నిర్మల. పురుషుల డామినేషన్ ఉండే సినీ పరిశ్రమలో ఆమె ఎన్నో మైలురాళ్లు అందుకున్నారు.
ఆమె అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఎక్కిన సంగతి తెలిసిందే. కృష్ణ సతీమణి విజయనిర్మల పేరును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారానికి సిఫార్సు చేయబోతోందట. ఈ విషయాన్ని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవే స్వయంగాకు చెప్పారు.
రాయల్ అకాడమీ డాక్టరేటును ప్రదానం చేసింది. ఆ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... విజయనిర్మల గొప్పదనాన్ని కొనియాడారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఆమెను పద్మ భూషణ్ పురస్కారానికి సిఫార్సు చేయబోతోందని చెప్పారు.