ఆసియా కప్ 2022 లో భాగంగా ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు జోరుగా సాగుతున్నాయి. ఇండియా సూపర్ 8 తొలి మ్యాచ్ లో తన దాయాది పాకిస్తాన్ తో ఓటమి చెందడంతో ఒక్కసారిగా లెక్కలన్నీ మారిపోయాయి. ఉత్కంఠగా జరిగిన ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ విజయ దుందుభి మోగించింది. దీనితో ఇండియా ఫైనల్ కు చేరుకోవాలంటే తర్వాత రెండు మ్యాచ్ లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీవ్ర ఒత్తిడిలో ఈ రోజు ఇండియా శ్రీలంక తో రెండవ మ్యాచ్ ను ఆడనుంది. ఇంకాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కానుండగా అందరి దృష్టి ఇండియాపై ఉంది. ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉండగా

ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ  ఎటువంటి వ్యూహాలతో బరిలోకి దిగనున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. అంతే కాకుండా తుది జట్టుపై కూడా చాలా కసరత్తులు చేస్తోంది జట్టు యాజమాన్యం. ఎందుకంటే.. గత మ్యాచ్ లో చాహల్ , హార్దిక పాండ్య విఫలం కావడం, భువి సైతం ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం తో ఆల్టర్నేటివ్ గా బౌలర్స్ ను సెట్ చేస్తున్నారు. ఇక బ్యాటింగ్ యూనిట్ లో సైతం మార్పులు తప్పవని తెలుస్తోంది. అయితే ఎవరు అనేది అధికారికంగా తెలియాలంటే మ్యాచ్ సమయం వరకు వేచి చూడాల్సిందే.

ఇక ఎప్పటిలాగే టీ 20 లో ఏ జట్టును కూడా తేలిగ్గా తేసుక్కూడదు. ఇందుకు నిదర్శనమే ఆసియా కప్ లో అదరగొడుతున్న ఆఫ్గనిస్తాన్ జట్టు. శ్రీలంక జట్టు నిండా ఆల్ రౌండర్లు ఉండడం వారికి కలసిసొచ్చే అంశం. ఈ మ్యాచ్ లో గెలుపుకు మొదటి పునాది మాత్రం టాస్ గెలవడమే. టాస్ గెలిచి చేజింగ్ తీసుకుంటే సగం మ్యాచ్ గెలిచినట్లే. మరి ఈ రోజు ఇండియాకు చావో రేవో మ్యాచ్ లో గెలిచి ఆసియా కప్ ట్రోఫీకి పోటీలో ఉంటుందా అన్నది చుద్దా,.

మరింత సమాచారం తెలుసుకోండి: