ప్రముఖ బుల్లితెర ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న రోహిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. నటిగా, జబర్దస్త్ లేడి కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె పలు టీవీ సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది. అంతేకాదు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ తన టాలెంట్ ను బయటపెట్టిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రోహిణికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఆమె చేసిన నిర్లక్ష్యం వల్లే ఆమె అతిపెద్ద ప్రమాదానికి గురైంది అని సమాచారం మామరి ఆ నిర్లక్ష్యం ఏమిటి ? ఆ ప్రమాదం ఏమిటి? ఆమెకు ఎక్కడ సర్జరీ జరిగింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న రోహిణి ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం,  ఇన్స్పెక్టర్ కిరణ్ వంటి సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకొని మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఆ తర్వాత లేడీ కమెడియన్ గా మారి జబర్దస్త్ తో పాటు ఇతర కామెడీ షోలలో కూడా సందడి చేసింది. సినిమాలలో సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ భారీగానే ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ఇకపోతే తాజాగా ఒక వీడియో షేర్ చేసుకుంది రోహిణి. అందులో తనకు ఒక సర్జరీ చేశారు అంటూ ఆమె తెలిపింది. ఐదు సంవత్సరాల క్రిందట తనకు ఒక యాక్సిడెంట్ జరిగిందట. దాంతో కాళ్ళకి రాడ్ వేసారని అయితే ఇంతకాలం ఆ రాడు తీయడానికి తనకసలు టైమే లేకపోవడం షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల.. ఆ రాడ్ తీయించుకోవడానికి అవకాశాలు సమయం దొరకలేదట. అందుకే ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తే సర్జరీ చేయడంతో రెండు కాళ్లు బాగా నొప్పి పుడుతున్నాయని ఆమె చెప్పుకొచ్చింది. అప్పుడే రాడ్ తీయించుకొని ఉండి ఉంటే ఇప్పుడు ఇంత బాధ భరించాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అంటూ బాధపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: