పోస్ట్ ఆఫీసు యెప్పటికపుడు కొత్త కొత్త స్కీమ్ లు పెడుతూ వుంటుంది.అందులో బాగంగా మరొక కొత్త పథకం ను ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది,అదేంటి అనుకుంటున్నారా.. కిసాన్ వికాస్ పత్రాస్కీమ్.ఈ స్కీమ్ ద్వారా మీ వద్ద వున్న డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు.చాలా మంది మ్యూచ్వల్ ఫండ్స్ లో ఇన్వస్ట్ చేస్తూ వుంటారు..

ఐతే అందులో మన డబ్బుకు గ్యారెంటీ వుంటుందని చెప్పలేం. అయితే మీరు డబ్బులు ఎక్కడ పెట్టాలి? అని పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు.  ఇందులో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ లేకుండానే డబ్బులు ..డబుల్ చేసుకోవచ్చు. పోస్టాఫీస్ పలు రకాల సేవింగ్ స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది..

కచ్చితమైన లాభం వస్తుంది. అయితే ఇక్కడ డబ్బులు రెట్టింపు కావాలంటే మాత్రం దీర్ఘకాలం వేచి ఉండాలి. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ మెచ్యూరిటీ కాలం 124 నెలలు. ఈ కాలంలో మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. కేంద్ర ప్రభుత్వం మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు 6.9 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: