ఏపీ సీఎం జగన్ విదేశీ యాత్ర చేయబోతున్నారు. ఈ నెల  20 తేదీ నుంచి 31 తేదీ వరకూ ముఖ్యమంత్రి జగన్  విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. అధికారిక, వ్యక్తిగత  పర్యటనల నేపథ్యంలో 10 రోజుల పాటు ఆయన విదేశాల్లో గడపుతారు. ఇందు కోసం సీఎం జగన్ కుటుంబంతో సహా 20 తేదీన స్విట్జర్లాండ్ కు వెళ్లనున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని ఆయన మళ్లీ ఈనెల 31 తేదీన రాష్ట్రానికి తిరిగి వస్తారు.


ఇక విదేశీ పర్యటనలో మే 22, 23, 24 తేదీల్లో దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరవుతారు. అక్కడ పలు విదేశీ కార్పోరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం జగన్ వరుసగా సమావేశం కానున్నారు. దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులోని ఏపీ పెవిలియన్ కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతోంది. వాటిలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత ఈనెల 25 తేదీ నుంచి సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: