ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ గురించి జగన్ ప్రభుత్వం ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 1 నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో బయో మెట్రిక్‌ హాజరును అమలు చేయాలని నిర్ణయించింది.  బోధన, జిల్లా, ప్రాంతీయ, సామాజిక ఆస్పత్రుల్లో బయో మెట్రిక్‌ హాజరు అమలు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.

 
ఈ ఆస్పత్రుల్లో పని చేసే వైద్యులు, సిబ్బందికి బయో మెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేసింది. బయో మెట్రిక్‌ పర్యవేక్షణ కోసం ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విధులకు వచ్చి అనుమతి లేకుండా బయటికి వెళ్లిన వారి సెలవుల్లో కోత విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఆసుపత్రుల్లోని పని దొంగలకు తాళం పడనుంది. ప్రభుత్వ వైద్యులు అధిక మొత్తంలో జీతాలు తీసుకుంటున్నా సమయానికి అందుబాటులో ఉండరన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆరోపణలు మరీ ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వైద్యం కోసం ఎక్కువ మొత్తం డబ్బు ఖర్చు చేసే పరిస్థితి ఉండదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: