పునర్నిర్మాణం తర్వాత కొత్త రూపు సంతరించుకున్న యాదాద్రిలో ఇవాళ కీలక ఘట్టం జరగబోతోంది. యాదాద్రీశుడి ఆలయ ఉద్ఘాటన ప్రక్రియలో ఇావాళ కీలకమైన రోజు.. ఆలయంలో పంచకుండాత్మక మహా యాగానికి ఇవాళ అంకురార్పణ జరగనుంది. పంచనారసింహుల ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ఈ పంచకుండాత్మక మహా యాగం నిర్వహించబోతున్నారు. ఉదయం 9 గంటలకు ఆది పూజలకు శ్రీకారం చుడతారు. బాలాలయంలో మహారాజాభిషేకంగా అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహిస్తారు. 108 మంది పారాయణికుల ఆధ్వర్యంలో ఈ మహా యాగం నిర్వహిస్తారు. ఈ యాగం తర్వాత ఆయన పునః ప్రారంభం కార్యక్రమాలు ఉంటాయి. మహాకుంభ సంప్రోక్షణకు శ్రీకారం చుట్టి పంచ కుండాత్మక మహా యాగానికి అంకురార్పణ చేసి 108 కలశాలతో అభిషేకం నిర్వహించడం ద్వారా యాదాద్రి పునః ప్రారంభ వేడుకలకు శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. అయితే.. ఈ వేడుకలకు చిన జీయర్ స్వామి హాజరవుతారా.. లేదా అన్నది ఇంకా నిర్ణయం కాలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: