ఇటీవల కాలంలో సభ్య సమాజంలో జరుగుతున్న ఘటనలు అందరిని ఉలిక్కిపడేలా చేస్తున్న  విషయం తెలిసిందే.   ముఖ్యంగా ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలతో  ఆడపిల్లల రక్షణ ప్రతి రోజు ప్రశ్నార్థకంగా మారుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కామంతో కళ్లు మూసుకుపోతున్న మనుషులు వావివరుసలు మరచి మరీ దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా దారుణంగా హత్యలకు సైతం వెనకాడటం లేదు అనే చెప్పాలి.  వెరసి ఇంటినుంచి కాదు బయట పెట్టిన ఆడపిల్ల మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందో లేదో అని అందరూ భయపడిపోతున్నారు అని చెప్పాలి.


 మొన్నటి వరకు కేవలం బయట తిరిగే ఆకతాయిలు   మాత్రమే ఆడ పిల్లలపై అత్యాచారాలు చేసేవారు. కానీ ఇటీవలి కాలం లో మాత్రం ఏకంగా  సొంతింటి వారు సైతం అత్యాచారాలకు పాల్పడుతున్నారు.. కన్నకూతురిపైనే తండ్రి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటన  వెలుగులోకి వస్తున్నాయి  ఇలాంటి ఘటనలతో  సభ్యసమాజమే  తలదించుకుంటుంది.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. నిజాంబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పన్నెండేళ్ల కన్న కూతురి పై తండ్రి అత్యాచారం పాల్పడ్డాడు అయితే.  బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించి కూతురిని తల్లి ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


 ఈ ఘటన స్థానికం గా సంచలనం గానే మారి  పోయింది అని చెప్పాలి.  అయితే పోక్సో చట్టం కింద ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇలాంటి కామాందులపై  కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.. కన్నకూతురిపైనే ఇలాంటి అత్యాచారం చేయటం  క్షమించరాని నేరం ఉరిశిక్ష పడేలా చూడాలి అంటూ  డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇలా ఇటీవలి కాలంలో ఎన్నో ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: