మొన్నటి వరకు కేవలం బయట తిరిగే ఆకతాయిలు మాత్రమే ఆడ పిల్లలపై అత్యాచారాలు చేసేవారు. కానీ ఇటీవలి కాలం లో మాత్రం ఏకంగా సొంతింటి వారు సైతం అత్యాచారాలకు పాల్పడుతున్నారు.. కన్నకూతురిపైనే తండ్రి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వస్తున్నాయి ఇలాంటి ఘటనలతో సభ్యసమాజమే తలదించుకుంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. నిజాంబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పన్నెండేళ్ల కన్న కూతురి పై తండ్రి అత్యాచారం పాల్పడ్డాడు అయితే. బాలిక ప్రవర్తనలో మార్పులు గమనించి కూతురిని తల్లి ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటన స్థానికం గా సంచలనం గానే మారి పోయింది అని చెప్పాలి. అయితే పోక్సో చట్టం కింద ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇలాంటి కామాందులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.. కన్నకూతురిపైనే ఇలాంటి అత్యాచారం చేయటం క్షమించరాని నేరం ఉరిశిక్ష పడేలా చూడాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇలా ఇటీవలి కాలంలో ఎన్నో ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి.