అశ్విన్ శరవణన్ తెరకెక్కించబోయే థ్రిల్లర్‌లో సమంతా అక్కినేని లీడ్ రోల్ లో నటిస్తుందని ముందు నుండీ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాప్సితో ‘గేమ్ ఓవ‌ర్‌’, నయనతారతో మాయ అనే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు తీసి హిట్ అందుకున్న అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో స‌మంత మూగ అమ్మాయిగా క‌నిపించబోతుందట‌. ఇది కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ అని సమాచారం.’ సోనీ పిక్చ‌ర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నట్టు తెలుస్తుంది.

తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేస్తారట. త్వరలో ఓటిటిలో విడుదల కాబోతున్న ‘నిశ్శబ్దం’ చిత్రంలో అనుష్క మూగ అమ్మాయిగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత కూడా అలాంటి ఛాలెంజింగ్ పాత్రనే ఎంచుకున్నట్టు స్పష్టమవుతుంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా ప్రకటించినప్పుడు, ఈ సినిమాలో కీలక పాత్రను నటుడు ప్రసన్న పోషిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ పాత్రను నటుడు ప్రశాంత్ పోషిస్తున్నట్లు తెలిసింది.

అయితే, ఆయన నటిస్తున్నాడన్న విషయాన్ని అయితే మేకర్స్ ధృవీకరించలేదు. రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. ఇదిలా వుండగా, సమంత లైనప్ లో విజయ్ సేతుపతి, నయనతార సినిమా ఉంది. నయన తార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా COVID 19 లాక్డౌన్ విధించటానికి కొన్ని వారాల ముందు ప్రకటించబడింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమంతా అక్కినేని, చివరిసారిగా జానులో కనిపించింది. ఇప్పుడు ఆమె బిజినెస్ మీద ఫోకస్ చేసింది. ఏకమ్ పేరుతో ఒక ప్రీ లెర్నింగ్ సెంటర్ అలానే సాకి పేరుతొ ఒక సొంత బట్టల బ్రాండ్ ని ఆమె లాంచ్ చేయనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: