"లవ్ స్టోరీ" ఫైనల్ షెడ్యూల్ పూర్తైపోయిన తరువాత నాగ చైతన్య వెకేషన్ కోసం సమంతతో మాల్దీవ్స్ కు వెళ్ళాడు. అక్కడ నుంచి రాగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సైన్ చేసేసాడు. ఈ సినిమాను "మనం" ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేయబోతున్నాడు.

 

ఇది రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోంది. ఈ సినిమా పేరు "థ్యాంక్ యూ". ఈ సినిమాకు బీవీఎస్ రవి కథను అందించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కెమెరాను హ్యాండిల్ చేయబోతున్నాడు. ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ చేసుకోబోతున్నాడు.  థమన్ స్వరాలను అందించబోతున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. 


ఈ షూట్ కు సంబంధించిన వివరాలని ప్రొడక్షన్ హౌస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి వెల్లడించింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.


ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో చైతూ రొమాన్స్ చేయబోతున్నారట. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో ఒక  హీరోయిన్ గా నటించబోతోంది. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చాడు దర్శకుడు విక్రమ్ కుమార్. ఈ స్టోరీ అనేది రెండు ప్రధాన  పాత్రల చుట్టూ తిరుగుతుందని స్టోరీకి సంబంధించిన ఆసక్తికర కాన్సెప్ట్ ను వెల్లడించాడు. 


ఇక వర్క్ పరంగా చూస్తే, నాగచైతన్య, "లవ్ స్టోరీ" సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో చైతూకు జోడీగా "సాయి పల్లవి" నటించింది. ఇది కూడా రొమాంటిక్ డ్రామాగానే తెరకెక్కింది. తమ కలలను నెరవేర్చుకోవడం కోసం ఒక అమ్మాయి అలాగే అబ్బాయి తమ గ్రామాన్ని దాటి సిటీలోకి ఎంటరవుతారు. అక్కడ వారు ఫేస్ చేసిన ఇబ్బందులను ఈ మూవీలో తెరకెక్కించారని టాక్. 


"లవ్ స్టోరీ" సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. నాగచైతన్య రీసెంట్ మూవీ "వెంకీమామ" నిరాశపరిచింది. "లవ్ స్టోరీ"తోనైనా సక్సెస్ కొట్టాలని చైతూ ఆశిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: