ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాల్లో 'దేశముదురు' సినిమా ఒకటనే విషయం తెలిసిందే. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా హన్సిక హీరోయిన్ గా నటించింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలో మొదట హీరోగా నటించే అవకాశం అక్కినేని హీరో సుమంత్ కు వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించలేదు. తాజాగా సుమంత్ నటించిన 'మళ్ళీ మొదలైంది' సినిమా ఇటీవల ఓటిటిలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దేశముదురు, నువ్వే కావాలి వంటి సినిమాలకు నో చెప్పడం వెనుక అసలు కారణాలను వివరించాడు సుమంత్. ఇక సోషల్ మీడియాలో తాను చాలా సినిమాలను రిజెక్టు చేసినట్లు ప్రచారం జరుగుతున్నా.. తాను రిజెక్ట్ చేసిన సినిమాలు మాత్రం రెండే అని చెప్పాడు సుమంత్. నువ్వేకావాలి సినిమా ఆఫర్ వచ్చిన సమయంలో తాను యువకుడు, పెళ్లి సంబంధం వంటి సినిమాల్లో నటిస్తున్నానని.. అందుకే ఆ సినిమా చేయడానికి తన డేట్స్ అడ్జస్ట్ కాలేదని సుమంత్ కామెంట్ చేశాడు. ఇక దేశముదురు సినిమా నాకు అస్సలు సూట్ కాదని డైరెక్టుగా చెప్పేశానని సుమంత్ వెల్లడించాడు.

అంతేకాదు దేశముదురు సినిమాలో తాను హీరోగా నటించి ఉంటే ఆ సినిమా సక్సెస్ సాధించి ఉండేది కాదని సుమన్ పేర్కొన్నాడు. బన్నీ, రవితేజ లాంటి హీరోలకు మాత్రమే దేశముదురు లాంటి కథలు సెట్ అవుతాయని సుమంత్ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. ఇక మరోవైపు అక్కినేని కుటుంబంలో అందరి హీరోలతో కలిసి పని చేయడం సులువు కాదని అన్నాడు. ఇక ఇటీవల తాను థియేటర్లో చూసిన చివరి సినిమా 'పుష్ప' అని.. ఇక అక్కినేని ఫ్యామిలీ మూవీ 'బంగార్రాజు' సినిమాను మాత్రం ప్రొడక్షన్ టైంలో  ప్రివ్యూ థియేటర్లో చూశారని సుమంత్ తెలిపాడు. అంతేకాదు బాలకృష్ణ గారి 'అఖండ' సినిమాను కూడా తాను థియేటర్లోనే ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు సుమంత్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: