
అలా ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, శర్వానంద్తో ‘శతమానం భవతి’, రామ్, నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోల సరసన చేసిన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అనుపమ కెరీర్లో ఒక పెద్ద మలుపు ‘కార్తికేయ 2’. ఈ సినిమా ఘన విజయంతో ఆమెను పాన్ ఇండియా ఆడియన్స్ గుర్తించారు. నిఖిల్ సరసన చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లడంతో, అనుపమ పాన్ ఇండియా బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇదే సమయంలో ‘బటర్ ఫ్లై’, ‘18 పేజీస్’ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి తన ప్రతిభను నిరూపించుకుంది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన ఒక విషయం ఏమిటంటే – ‘రంగస్థలం’ సి
అయినా ఈ ముద్దుగుమ్మ తనకంటూ సొంత స్థానం సంపాదించుకోవడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఇటీవలే విడుదలైన ‘కిష్కంధపురి’ సినిమాలో నటించిన అనుపమకు మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ‘పరదా’, ‘జానకి వర్సెస్ కేరళ’ వంటి ప్రాజెక్టుల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా జానకి వర్సెస్ కేరళలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం అనుపమకు మలయాళంలో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తెలుగు, తమిళంలో కూడా మంచి ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. చూడచక్కని రూపం, ఉంగరాల జుట్టు, ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే లుక్స్ – ఇవన్నీ ఆమెను యూత్ ఐకాన్గా మార్చేశాయి. మొత్తానికి కెరీర్ మంచి ఫాంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్, పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది.