మొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రం ద్వారా తెలుగు పరిచయమైంది బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ. ఇక తర్వాత రామ్ చరణ్ కు జోడిగా వినయ విధేయ రామ చిత్రంలో కూడా నటించింది. కానీ ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ అమ్మడు మరొకసారి రామ్ చరణ్ తోనే RC -15 సినిమా లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలోఈ  అమ్మడు పాల్గొన్నది . మొదటిసారిగా రామ్ చరణ్ తో నటిస్తున్న ఆర్సి 15 సినిమా పైన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పైన అటు అభిమానులలో సైతం ఇండస్ట్రీలో భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇక వీరిద్దరితో వర్క్ చేయడం తనకు ప్రత్యేక అనుభవం అంటూ తెలియజేసింది కియారా అద్వానీ. హీరోయిన్ కీయారా అద్వానీ మాట్లాడుతూ నా పాత్ర గురించి చెప్పడానికి నాకు పర్మిషన్ లేదు. కాబట్టి నేను చెప్పలేను.. ఇది పూర్తిగా విభిన్నమైన ప్రపంచం తో కూడి ఉంటుంది.

డైరెక్టర్ శంకర్ ఎలాంటి కథనైనా,  పాత్రనైనా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దగలరు. ఈ సినిమాతో మ్యాజిక్ చేస్తాడనే నమ్మకం తనకు ఉందని తెలియజేసింది. డైరెక్టర్ శంకర్ సెట్ లో మాత్రం చాలా స్పాంజ్ లాగా ఉంటానని తెలియజేసింది. అంతేకాకుండా తన చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ ఉంటాను. గత ఏడాది నవంబర్సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాము. త్వరలోనే తదుపరి షెడ్యూలు కూడా పూర్తి కాబోతోంది ఇది నా మొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో నాకు చాలా ఉత్సాహంగా ఉంది అంటూ తెలియజేసింది హీరోయిన్ కియారా అద్వానీ. తన రెండు తెలుగు చిత్రాలతో విజయాన్ని అందుకోలేకపోయిన కియారా కనీసం మూడవ సినిమా విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: