లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సంవత్సరాల తర్వాత వెండి తెరపై విక్రమ్ మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం మనకు తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత లోక నాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్' మూవీ లో హీరోగా నటించడం,  విజయ్ సేతుపతి , ఫహాద్ ఫాజిల్ ,  సూర్య లాంటి హేమాహేమీలు అయినా నటీనటులు విక్రమ్ మూవీ లో కీలక పాత్రల్లో నటించడం, వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న దర్శకుడు లోకేష్ కనకరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో విక్రమ్ మూవీ పై మొదటి నుండే పాన్ ఇండియా రేంజ్ లో  ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ప్రేక్షకుల్లో మొదటి నుండి భారీ అంచనాలు నెలకొని ఉన్న విక్రమ్ సినిమా జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తమిళ , తెలుగు , మలయాళ , కన్నడ , హిందీ భాషల్లో విడుదల అయ్యింది. విడుదల అయిన మొదటి షో కే విక్రమ్ మూవీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ కి కలెక్షన్ల వర్షం కురిసింది. అందులో భాగంగా విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 400  కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన విక్రమ్ మూవీ తాజాగా ఇండియాలో మరో రేర్ మార్క్ ను టచ్ చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్ ల కంటే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన విక్రమ్ సినిమా కేవలం ఇండియా లోనే 300 కోట్లకు పైగా క్రాఫ్ట్ కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేర్ మార్క్ ను టచ్ చేసింది.  చాలా సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఇండియా మొత్తం అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను వసూలు చేసి బీభత్సం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: