టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన సంపత్ నంది గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఏమైంది ఈ వేళ అనే ప్రేమ కథ చిత్రం తో తన కెరీర్ ని మొదలు పెట్టాడు. ఆ సినిమాతో మంచి విజయాన్ని మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న సంపత్ నంది కి ఆ తర్వాత ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రచ్చ' సినిమాకు దర్శకత్వం వహించాడు.  రచ్చ సినిమా మంచి విజయం సాధించడంతో అప్పటి నుండి సంపత్ నంది కేవలం మాస్ ఎంటర్టైనర్ మూవీ లకు మాత్రమే దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా సంపత్ నంది ఇప్పటికే బెంగాల్ టైగర్ , గౌతమ్ నంద , సిటీ మార్ అనే మాస్ ఎంటర్ టైనర్ మూవీ లకు దర్శకత్వం వహించాడు. దాదాపు ఈ సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలనే అందుకున్నాయి.

ఇలా క్లాస్ మూవీ తో కెరీర్ మొదలు పెట్టి ప్రస్తుతం మాస్ దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ను కొనసాగిస్తున్న సంపత్ నంది సీటిమార్  సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్నా తన తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సంపత్ నంది,  రవితేజ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాట్లు తెలుస్తోంది. ఇప్పటికే సంపత్ నంది , రవితేజ కు ఒక కథను వినిపించినట్లు , ఆ కథ బాగా నచ్చిన రవితేజ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్ లో బెంగాల్ టైగర్ మూవీ తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: