వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య 22 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NC22 సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది.అయితే ఇప్పుడు మిగతా ప్రధాన పాత్రల్లో కనిపించే నటీనటులను శుక్రవారం ఉదయం నుంచీ మేకర్స్ వరుస అప్డేట్ లతో ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ యాక్షన్ మూవీలో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన సుప్రీమ్ టాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. రామ్ చరణ్ 'ధృవ' చిత్రంలో రౌడీగా నటించిన అరవింద్ స్వామీ చాలా గ్యాప్ తర్వాత చైతూ కోసం విలన్ గా మారుతున్నారని తెలుస్తోంది.అలానే తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ ఇంకా జాతీయ అవార్డు విన్నింగ్ నటి ప్రియమణి శక్తివంతమైన పాత్రలు పోషిస్తున్నారని పేర్కొన్నారు. కోలీవుడ్ కమెడియన్ ప్రేమ్ జీ అమరన్ ఇంకా వెన్నెల కిషోర్ నవ్వించే బాధ్యత తీసుకోగా.. విలక్షణ నటుడు సంపత్ రాజ్ ఈ సినిమాలో భాగం అవుతున్నారు. 'కార్తీక దీపం' సీరియల్ తో 'వంటలక్క'గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రేమి విశ్వనాథ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. తమిళ హీరో జీవా అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.


నాగచైతన్య డెబ్యూ తమిళ మూవీ కోసం అద్భుతమైన ప్రతిభావంతులైన నటీనటులను తీసుకోవడం అభిమానులను ఇంకా ప్రేక్షకులను ఆనందపరుస్తోంది. ఇందులో చైతూ ఒక పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కోరుకునే మాస్ అండ్ యాక్షన్ అంశాలతో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న మేకర్స్.. రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ అవ్వడానికి రెడీ అవుతున్నారు.శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని పవన్కుమార్ సమర్పించనున్నారు.లెజెండరీ తండ్రీ కొడుకులు మాస్ట్రో ఇసైజ్ఞాని ఇళయరాజా ఇంకా లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి పాటలను ట్యూన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా.. ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా.. డివై సత్యనారాయణ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. యాన్నిక్ బెన్ - మహేష్ మాథ్యూ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండగా.. వెంకట్ రాజన్ ఎడిటర్ గా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: