ఎట్టకేలకు మరో ముద్దుగుమ్మ వివాహం చేసుకోబోతోంది.. టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ పాత్రలో అయినా సరే సునాయాసంగా లీనమైపోయి నటించే అద్భుతమైన ప్రతిభ వున్న హీరోయిన్ అని చెప్పడంలో సందేహం లేదు. తన నటనతో అందంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అన్ని బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా రారండోయ్ వేడుక చూద్దాం, బ్రూస్లీ , నాన్నకు ప్రేమతో, ధ్రువ, సరైనోడు అవంటి చిత్రాలతో భారీ పాపులారిటీని దక్కించుకున్న ఈమె తర్వాత కథల ఎంపిక విషయంలో తడబడి డిజాస్టర్ ను చవిచూచింది.

ఇకపోతే గత కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించని రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి రకుల్ ప్రీతిసింగ్ ప్రేమలో ఉందని త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ కూడా వార్తలు వినిపించాయి.  కానీ వీటిపై స్పందించిన రకుల్ ప్రీతిసింగ్ అదంతా కేవలం పుకారులు మాత్రమే అని వెల్లడించింది.  కానీ ప్రముఖ నటుడు జాకీ భగ్నానీ తో ఈమె ప్రేమలో ఉన్నట్లు త్వరలోనే వివాహం కూడా చేసుకోబోతున్నట్లు ఇప్పుడు మరింతగా వైరల్ అవుతున్నాయి.


పెళ్లికి రకుల్ ప్రీతిసింగ్ సిద్ధమయింది అంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకోబోతుందో కూడా ప్రచారం జరుగుతుంది .అసలు విషయంలోకి వెళ్తే 2023 ఫిబ్రవరి నెలలో తన ప్రియుడు జాకీ భగ్నానీ తో ఈమె మూడు ముళ్ళు వేయించుకోవడానికి సిద్ధమయింది అంటూ సమాచారం. బాలీవుడ్ నటుడిగా,  నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న జాకీతో రకుల్ ప్రీతిసింగ్ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే.  కానీ ఆమె బయటపడలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై రకుల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: