టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయాలన్నీ వీరిద్దరూ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. అయితే చాలా వరకు వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారు అన్నట్టుగా కలిసి తిరుగుతూ ఉంటారు.వీరిద్దరు  కలిసి తిరగడం వల్లే చాలామంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టుగా భావిస్తున్నారు. అయితే గతంలో వీళ్ళిద్దరూ కలిసి మాల్దీవ్స్ కి వెళ్ళినట్టు అప్పట్లో వార్తలు కూడా రావడం జరిగింది. అంతేకాదు అప్పట్లో ఒక పండుగ సందర్భంగా రష్మిక మందన విజయ్ దేవరకొండ ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో పండగను సెలబ్రేట్ చేసుకున్నట్లుగా..

 సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ కచ్చితంగా ప్రేమలో ఉన్నారు అన్నా వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా నూతన సంవత్సరం అంటే అందరూ సినీ సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ వారికి నచ్చిన పోస్టులను వారి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన కూడా వారిద్దరికీ సంబంధించిన ఒక పోస్ట్ ను వారి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు బ్యాక్ గ్రౌండ్ ఒకే లాగా ఉంది.

దీంతో ఈ ఫోటోను చూసిన చాలా మంది ఖచ్చితంగా వీరిద్దరూ కలిసి న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటూ కామెంట్లో చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ తన ఫోటో కింద ఒక క్యాప్షన్ ను కూడా పెట్టడం జరిగింది.అందులో... ఒక ఏడాది చాలా సందర్భాల్లో వచ్చాయని.. గట్టిగా నవ్వమని.. బాధతో లోలోపలే ఏడ్చాం.. అనేక లక్ష్యాలను చేదించాం.. అన్నిటిని గెలిచాము.. మరికొన్నిటిని ఓడిపోయాము.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే రష్మిక మందన కూడా తను మాల్దీవ్స్ లో ఉన్నట్లుగా ఒక ఫోటోను షేర్ చేస్తుంది. దీంతో వీరిద్దరూ కలిసి నూతన సంవత్సర వేడుకలని జరుపుకుంటున్నారు అంటూ ఈ ఫోటోను చూసిన చాలా మంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: