హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో హీరోయిన్ దీపిక పదుకొనే కూడా ఒకరు.ఈమె కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో బిజీగా మారిపోయారు.

ఇక ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం.. అయితే ఈమెకు టాలీవుడ్ హీరోలతో నటించడం మాత్రం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను అయితే జరుపుకుంటుంది.

ఇలా ఈ సినిమాతో పాటు ఈమె బాలీవుడ్ సినిమాలతో కూడా బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ తో కలిసి పఠాన్ సినిమాలో కూడా నటించారు.ఈ సినిమా జనవరి 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. అయితే ఈ సినిమా విడుదల కాకుండానే ఈ సినిమాలో బేషరమ్ అనే సాంగ్ ద్వారా పెద్ద ఎత్తున అయితే వివాదాలలో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వివాదం గురించి ఇప్పటివరకు దీపిక ఏమాత్రం స్పందించకపోవడం విశేషం.

ఇక ప్రస్తుతం ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయటా.. ఇందులో ప్రభాస్ సరసన నటించిన దీపిక పదుకొనే మరొక ఇద్దరు టాలీవుడ్ హీరోలపై కూడా మనసు పారేసుకున్నారని సమాచారం.. ప్రభాస్ తో కాకుండా తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి హీరోలతో కలిసి నటించాలని ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె తన మనసులో ఉన్న కోరికను అయితే బయటపెట్టారు. మరి ఈమెకు ప్రభాస్ మాదిరిగానే తారక్ మరియు బన్నీ అవకాశం కల్పిస్తారా లేదా అనేది చూడాలి మరీ

మరింత సమాచారం తెలుసుకోండి: