మాస్ మహరాజా రవితేజ రాజా ది గ్రేట్ తర్వాత రెండు వరుస ఫ్లాపులని ప్రేక్షకులకి అందించాడు. ఇప్పుడు ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వెంకీ, దుబాయ్ శ్రీను చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఇప్పుడు చేస్తున్న సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అమర్ అక్బర్ ఆంటోని అనే చిత్ర టైటిల్తో రూపొందుతున్న ఈ మూవీ కొద్ది రోజులుగా హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటుంది.
గోవా బ్యూటీ చాలా రోజుల తరువాత ,ఇంకా చెప్పాలంటే చాలా సంవత్సరాల తరువాత తెలుగు సినిమా చేస్తుంది.రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా రూపొందుతోంది.ఈ సినిమాలో ఓ హీరోయిన్గా ఇలియానాను తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగులో ఇలియానా జాయిన్ అయింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలోని విజువల్స్ అత్యున్నంగా ఉండేలా నిర్మాతలు ప్లాన్ చేశారట. చిత్రంలో రెడ్ మాన్స్ట్రో కెమెరా, జీస్ సుప్రీమ్ లెన్సెస్లని ఉపయోగిస్తున్నారట. వితేజ, ఇలియానా కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
శ్రీను వైట్ల పిల్లలు కూడా ఈ సినిమా షూటింగ్ కోసం అమెరికాకి వచ్చారు. పిల్లలతో హీరోయిన్ ఇలియానాతో బాగా కలిసిపోయారని ,వాళ్లు ఇలియానాకి స్పెషల్ గా వాళ్లు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రవితేజ ఇలియానా కలిసి ఇప్పటికే మూడు సినిమాలలో నటించారు.