
ముద్దుల కృష్ణయ్య.. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంతోనే ఆ ఏడాది బాలయ్య విజయ పరంపర మొదలైంది. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా నటించారు. గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
సీతారామ కళ్యాణం.. 1986లో విడుదలైన మరో సూపర్ హిట్ మూవీ. జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ, రజినీ జంటగా నటించారు. పగ ప్రతీకారాలతో రగిలిపోయే రెండు గ్రామాల మధ్య నడిచే లవ్ స్టోరీ ఇది. `ముద్దుల కృష్ణయ్య` థియేటర్స్ ఆడుతుండంగానే `సీతారామ కళ్యాణం` కూడా విడుదలైంది. అయితే ప్రేక్షకులు రెండు చిత్రాలకు బ్రాహ్మ రథం పట్టారు. ఈ సినిమాలో `రాళ్ళల్లో ఇసకల్లో, `కళ్యాణ వైభోగమే` పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అనసూయమ్మ గారి అల్లుడు.. అదే ఏడాది జులైలో విడుదలైన చిత్రం. కోదండరామిరెడ్డి డైరెక్టర్ కాగా.. బాలకృష్ణ, భానుప్రియ జంటగా నటించారు. శారద ముఖ్యమైన పాత్ర పోషించగా.. నందమూరి హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. థియేటర్స్ లో 200 రోజులు ఆడింది.
ఆ తర్వాత `దేశోద్ధారకుడు` మూవీ తో బాలకృష్ణ తన సక్సెస్ జోరును కొనసాగించారు. గొల్లపూడి మారుతీ రావు కథ అందించిన ఈ చిత్రానికి ఎస్. ఎస్. రవిచంద్ర డైరెక్టర్. బాలయ్య, విజయశాంతి జంటగా నటించారు. ఆగస్టులో రిలీజ్ అయిన దేశోద్ధారకుడు కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అప్పట్లోనే రూ. 5 కోట్ల రేంజ్ లో వసూళ్లను కొల్లగొట్టింది.
అదే ఏడాది బాలయ్య 30వ సినిమాగా `కలియుగ కృష్ణుడు` మూవీ విడుదల అయింది. కె. మురళీ మోహనరావు తెరకెక్కించిన ఈ చిత్రం లో రాధ హీరోయిన్. సెప్టెంబర్ లో రిలీజ్ అయిన కలియుగ కృష్ణుడు కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఇక 1986లోనే `అపూర్వ సోదరులు` మూవీతో రెండోసారి హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విజయశాంతి, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ లో రిలీజ్ అయిన అపూర్వ సోదరులు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కుమ్మేసింది.