నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరీర్లో చాలా సినిమాలు చేశారు. అందులో కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అందులోను... కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన పటాస్ సినిమా సూపర్ హిట్టైంది. ఆ తరువాత అలాంటి హిట్ అందుకోలేదు. కామెడీ ప్రధానంగా సాగే సినిమా చేయడం కోసం కళ్యాణ్ రామ్ మరలా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే, సంపత్ నంది తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.
కళ్యాణ్ రామ్ కోసం సంపత్ నంది అదిరిపోయే ఫన్ స్క్రిప్ట్ ఒకటి రెడీ చేశారట. కళ్యాణ్ రామ్ కు కూడా నచ్చడంతో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. సినిమా కోసం కళ్యాణ్ రామ్ చాలా కష్టపడుతున్నాడు. ఎలాగైనా మంచి హిట్ కొట్టి తిరిగి ఇండస్ట్రీలో తన హవా చాటాలని అనుకుంటున్నాడు. అయితే, సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే తన సినిమాలకు తానే ప్రొడ్యూసర్ గా ఉంటూ నిర్మిస్తున్నాడు. జైలవకుశ సినిమాతో తమ్ముడు ఎన్టీఆర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. మరోమారు ఎన్టీఆర్ సినిమాకు నిర్మాతగా మారే అవకాశం కనిపిస్తోంది. శాండల్ వుడ్ లో సూపర్ హిట్ సినిమా కేజీఎఫ్ ను ప్రేక్షకులకు అందించిన ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించాలనే ఆలోచనలో ఉన్నది. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా భాగస్వామ్యం కావాలని అనుకుంటోంది. మైత్రి మూవీస్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా కలిస్తే.. సినిమాను మరో రేంజ్ లో తీయొచ్చన్నది ప్రశాంత్ నీల్ ఆలోచన. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా పూర్తి స్థాయిలో డ్యాన్స్ మూవీగా తీయబోతున్నారట. కేజీఎఫ్ చాఫ్టర్ 2 సినిమా పూర్తయ్యాక ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది.