సామాన్య ప్రజలందరూ ఎదురు చూస్తున్న  కూడా యూనియన్ బడ్జెట్ వచ్చేసింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ వేదికగా యూనియన్ బడ్జెట్ ప్రకటించారు. కరోనా వైరస్ సమయం లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యులపై ఇక నిర్మలమ్మ ప్రకటించే యూనియన్ బడ్జెట్ కాస్త భారాన్ని తగ్గిస్తుంది అని సామాన్య ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే సామాన్య ప్రజలకు గుదిబండలా మారే విధంగా ఎన్నో ధరలు పెరిగిపోయాయి అన్నది తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మల సీతారామన్ ప్రకటించిన యూనియన్ బడ్జెట్ వల్ల రానున్న రోజుల్లో ఏ ధరలు పెరగబోతున్నాయి ఏ ధరలు తగ్గిపోతున్నాయో తెలుసుకుందాం.


 పెరుగుతున్నవి :
 - పత్తి ఉత్పత్తి ధరలు భారీగా పెరిగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- వంట నూనెల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటుతు ఉండగా ఇప్పుడు మరింత పెరిగ పోతున్నాయి.

 - మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, వాషింగ్ మిషన్ ల ధరలు కూడా  మరింత పెరగబోతున్నాయి.

- ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడుతూ ఉండగా.. ఇక ఇప్పుడు యూనియన్ బడ్జెట్ ప్రకారం రానున్న రోజుల్లో ఎరువుల ధరలు పెరిగి రైతుల పై మరింత భారం ఎక్కువ కానుంది.

 - విదేశీ మద్యం ధరలు కూడా పెరుగుతాయి.

- బటాని, కాబూలీ శనగలు ధరలు పెరగనున్నాయి.

- ఇక ఇప్పుడు సామాన్యుల అందరికీ కూడా భారంగా మారిపోయిన పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవు అంటూ కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం గమనార్హం.


 ఏవి తగ్గిపోతున్నాయి అంటే :

- మొబైల్ ఛార్జింగ్ ధరలు తగ్గిపోతున్నాయి.

- బెల్ట్,  పర్స్ లాంటి లెదర్ ఉత్పత్తులు షూస్ లాంటివి తగ్గిపోనున్నాయి.

- సోలార్ లాంతర్లు ధరలు కూడా తగ్గనున్నాయి.

 - స్టీల్ ధరలు సామాన్యులకు ప్రియం కాబోతున్నాయి.

- కస్టమ్స్ డ్యూటీ  తగ్గిన నేపథ్యం లో బంగారం వెండి ధరలు రానున్న రోజుల్లో తగ్గిపోతున్నట్లు తెలుస్తుంది.

 - నైలాన్ దుస్తుల ధరలు కూడా తగ్గి పోనున్నాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: