ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న అద్భుతమైన పథకాలలో అన్న క్యాంటీన్ కూడా ఒకటి. ఈ స్కీమ్ అమలు వల్ల ఎంతోమంది పేదవాళ్ల కడుపు నిండుతోందనే సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల సంఖ్యా పెంచాలని ప్రజలు సైతం కోరుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో మండలానికి ఒక అన్న క్యాంటిన్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 100కు పైగా అన్న క్యాంటీన్లు  ఉన్నాయి.  అయితే మండలానికి ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.  ఈ నిర్ణయం అమలైతే మాత్రం పేద ప్రజలకు ఎంతో  ప్రయోజనం చేకూరనుంది చెప్పవచ్చు. అన్న క్యాంటీన్ల అమలు వల్ల ఎంతోమంది పేద ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా  కూడా   మేలు జరగనుందని చెప్పవచ్చు.

ఈ పథకం తక్కువ  ఖర్చుతో ప్రభుత్వానికి మేలు చేసే పథకం అని అభిప్రాయాలు  వ్యక్తమవుతున్నాయి. జనాభా  లెక్కన   ఈ పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మండలానికి ఒక అన్న క్యాంటీన్ ను అమలు చేస్తే  కూటమి సర్కార్ కు మంచి జరిగే  అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై  ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం అమలు వల్ల దీర్ఘకాలంలో  ఏంటో బెనిఫిట్ కలగనుంది  చెప్పవచ్చు.  ప్రస్తుతం కేవలం 5 రూపాయాలకే  బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందించడం సాధారణ విషయం కాదు. బయట ఖర్చులు ఏ స్థాయిలో పెరిగాయో  ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. లక్షల సంఖ్యలో ప్రజలు ఈ పథకం ప్రయోజనాలు పొందుతున్నారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: