తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును... కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఈసారి కూడా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారని అంటున్నారు. గత ఏడాది మే 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు ఆన్లైన్ వేదికగా మహానాడు నిర్వహించారు. 


ఈసారి కూడా కోవిడ్ మరింత ఉద్ధృతం గా ఉన్నందువల్ల.. మహానాడు కార్యక్రమాన్ని ఎన్టీఆర్ పుట్టిన రోజు 28వ తేదీ ఒక రోజకు మాత్రమే పరిమితం చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ఒకరోజు జరిగినా రెండు రోజులు జరిగినా లేక రెండు రోజులు జరిగినా ఆన్లైన్ వేదికగానే జరగనుంది. రేపు చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న వ్యూహ కమిటీ సమావేశంలో మహానాడు ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: